ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి నరసరావుపేట జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10,000 చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు అతన్ని నరసరావుపేట కోర్టు ముందు హాజరుపరిచారు.
గత ఏడాది నవంబర్లో నరసరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోసాని కృష్ణ మురళిపై తెలుగుదేశం పార్టీ నేత కొట్టా కిరణ్ ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.