ప్రముఖ సినీ నటి సమంత ఈరోజు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. తన నిర్మాణంలో త్వరలో విడుదల కానున్న ‘శుభం’ చిత్ర బృందంతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సమంత మరియు ‘శుభం’ యూనిట్ సభ్యులు ఆలయానికి చేరుకున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమంత మరియు చిత్ర యూనిట్ సభ్యులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సమంత మరియు చిత్ర బృందానికి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. తరువాత స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. దర్శనానికి ముందు, సమంత వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో డిక్లరేషన్ సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *