Singer Zubeen Garg: అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సిట్ దర్యాప్తులో మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, నిర్వాహకుడు శ్యామ్కాను మహంత, బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో-సింగర్ అమృత్ప్రవ మహంతను అరెస్ట్ చేశారు. అయితే జుబీన్ భద్రతా సిబ్బంది ఇప్పటికీ సింగపూర్లోనే ఉండడం, వారి ఖాతాల్లో కోటి రూపాయలు జమ కావడం అనుమానాలు రేపుతోంది. అధికారులు వారిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నా, వారు అందుబాటులో లేరు.
సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకారం, అక్టోబర్ 10న విసెరా నివేదిక రానుంది, దానితో అసలు విషయం బయటపడుతుందని చెప్పారు. బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి వాంగ్మూలంలో, మేనేజర్ మరియు నిర్వాహకుడు గాయకుడికి విషమిచ్చి ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించాడు. జుబీన్ నోరు, ముక్కు నుంచి నురగ వస్తున్నప్పుడు కూడా మేనేజర్ నిర్లక్ష్యం చూపాడని పేర్కొన్నాడు. సెప్టెంబర్ 19న సింగపూర్లో జరిగిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో జుబీన్ ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయాడు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మూసేసిన థియేటర్స్ కూడా కాంతార కోసం తెరిచారు..
External Links:
జుబీన్ గార్గ్ కేసులో సంచలన విషయాలు.. ఖాతాలో రూ.కోటి జమ