ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు సీఆర్పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన 12 మంది వ్యక్తులపై రూ.40 లక్షల రివార్డు ఉందని సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ వెల్లడించారు. వారందరూ అనేక హింసాత్మక మరియు విధ్వంసక సంఘటనలలో పాల్గొన్నారు.

లొంగిపోయిన వారిలో మావోయిస్టు మిలిటరీ డిప్యూటీ కమాండర్ ముచాకి జోగా మరియు అతని భార్య, స్క్వాడ్ సభ్యురాలు ముచాకి జోగి ఉన్నారు. వారిపై రూ. 8 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు దేవే, దుధి భుద్రాలపై ఒక్కొక్కరిపై రూ. 5 లక్షల రివార్డు ఉందని తెలిపారు. మరో ఏడుగురికి రూ.2 లక్షల రివార్డు, ఒకరికి రూ.50 వేల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో ఒక్కొక్కరికి రూ.50,000 ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. వీరికి ప్రభుత్వ పునరావాస పథకాన్ని వర్తింపజేస్తామని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *