Cloud Seeding

Cloud Seeding: ప్రతి సంవత్సరం నవంబర్‌లో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుంది. పంజాబ్‌, హర్యానా రైతులు పంటల వ్యర్థాలను తగలబెట్టడం, చలికాలం పొగమంచు కారణంగా గాలి నాణ్యత దెబ్బతింటుంది. ఈసారి కూడా పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఢిల్లీ ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్‌ ద్వారా కృత్రిమ వర్షం కురిపించేందుకు ప్రయత్నించింది. ఐఐటీ కాన్పూర్‌ సహకారంతో పలు ప్రాంతాల్లో మూడు ట్రయల్స్‌ చేసినా ఫలితాలు రాలేదు. ఈ ప్రక్రియకు రూ.3.21 కోట్లు ఖర్చు కాగా, మరిన్ని ట్రయల్స్‌ చేయాలనే ప్రణాళికను ప్రభుత్వం ఆపేసింది. ఈ ప్రక్రియ చాలా ఖరీదైనదని, శీతాకాలం మొత్తం అమలు చేస్తే రూ.25–30 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు.

కృత్రిమ వర్షం పద్ధతి పాతదే. 1946లో డ్రై ఐస్‌ ఉపయోగించి మొదటిసారిగా కురిపించారు. మబ్బుల్లోని నీటి బిందువులను ఘనీభవింపచేయడానికి సిల్వర్‌ అయోడైడ్‌, పొటాషియం అయోడైడ్‌, డ్రై ఐస్‌ వంటి పదార్థాలు వాడతారు. కానీ వర్షం రావాలంటే మేఘాలు తగిన తేమతో, దట్టంగా ఉండాలి. ఈ రసాయనాలను విమానాల ద్వారా లేదా నేల నుండి మేఘాల వైపు పంపిస్తారు. అయితే ఈ విధానం ఖరీదైనదే కాకుండా ఫలితాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అయినా కొత్త సాంకేతికతలతో, లేజర్‌ కిరణాల వంటి పద్ధతులతో వర్షాన్ని కురిపించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేసిన భారత రిఫైనరీలు..

నేడు ఢిల్లీలో కృత్రిమ వర్షం…

External Links:

రూ.కోట్లు కుమ్మరించినా పడని వర్షం.. క్లౌడ్‌సీడింగ్‌కు ఎంత ఖర్చైందో తెలుసా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *