Rain in Delhi: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకూ క్షీణిస్తోంది. దీపావళి తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది. తీవ్రమైన వాయుకాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైంది.
వాతావరణం అనుకూలిస్తే ఇవాళ ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్కు అవకాశం ఉంది. పొగ మంచు సీజన్లో కాలుష్య కణాలను తగ్గించడానికి వాయువ్య ఢిల్లీలో ఐదు చోట్ల ఈ కృత్రిమ వర్షం కురిపించనున్నారు. ఇందుకోసం డీజీసీపీ అనుమతి పొందారు. ఇటీవలే బురాయ్లో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైన విషయం తెలిసిందే. సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి పదార్థాలను మేఘాల్లోకి విడుదల చేయడం ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు. ఈ వర్షం కారణంగా రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
ఆర్థిక వృద్ధికి కొత్త దారులు చూపించారు… అర్థశాస్త్ర నోబెల్ బహుమతి విజేతల ప్రకటనా