Cyclone Montha Turns Into Danger

Cyclone Montha Turns Into Danger: మొంథా తుఫాన్‌ క్రమంగా బలపడుతూ ఇప్పుడు పెను తుఫాన్‌గా మారింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై, గంటకు 12 కిమీ వేగంతో ఉత్తర–వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 160 కిమీ, కాకినాడకు 240 కిమీ, విశాఖపట్నానికి 320 కిమీ దూరంలో ఉంది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం–కళింగపట్నం మధ్య తీరాన్ని తుఫాన్‌ తాకే అవకాశం ఉంది. తీర దాటే సమయానికి గాలివేగం గంటకు 90 నుండి 110 కిమీ వరకు ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాన్‌ ప్రభావంతో తీర జిల్లాల్లో వర్షాలు, బలమైన గాలులు మొదలయ్యాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కాకినాడకు గ్రేట్ డేంజర్‌ సిగ్నల్‌ జారీ చేశారు, విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం పోర్టులకు 9వ నంబర్‌ హెచ్చరికలు ఇచ్చారు. విశాఖలో భారీ వర్షాల కారణంగా 36 విమాన సర్వీసులు రద్దయ్యాయి, గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు కూడా నిలిపివేశారు. తుఫాన్‌ ప్రభావంతో కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైళ్లు, విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లు రద్దు అయ్యాయి. నేడు, రేపు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.

ఆర్థిక వృద్ధికి కొత్త దారులు చూపించారు… అర్థశాస్త్ర నోబెల్ బహుమతి విజేతల ప్రకటనా

External Links:

పెను తుఫాన్‌గా మారిన మొంథా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *