Latest Telugu News

News5am, Latest Telugu News (03-06-2025): పాకిస్తాన్‌లో ఇటీవల వరుసగా కీలక ఉగ్రవాదులు హతమవుతున్నారు. తాజాగా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన సీనియర్ నేత మౌలానా అబ్దుల్ అజీజ్ సోమవారం బహవల్పూర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇటీవల భారత్‌ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా బహవల్పూర్‌లోని జైషే కార్యాలయంపై దాడి జరిగింది. అయితే, అజీజ్ మరణంపై పాకిస్తాన్ అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. జైషే మహ్మద్‌కు చెందిన సోషల్ మీడియా అకౌంట్స్ అతని మరణాన్ని ధ్రువీకరించాయి. అంత్యక్రియలు బహవల్పూర్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నా, పాక్ అధికారులు లేదా ఉగ్రనేతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మృతదేహంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ, జైషే వర్గాలు అతను గుండెపోటుతో మరణించారని చెబుతున్నాయి.

భారతదేశాన్ని సోవియట్ యూనియన్‌లా విభజిస్తానంటూ ఇటీవల బెదిరింపులకు పాల్పడిన మౌలానా అబ్దుల్ అజీజ్ కొద్ది రోజుల్లోనే మృతి చెందడం గమనార్హం. ‘‘బాల్కనైజేషన్’’ అనే పదం బాల్కన్ ద్వీపకల్పం విచ్ఛిన్నానికి సంబంధించినది. ఇది జాతి, మత, రాజకీయ విభాగాలతో ముడిపడి ఉంటుంది. అజీజ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More Today Latest Telugu News:

National Telugu News:

కెనడా జీ-20 సమావేశానికి ప్రధాని మోడీ వెళ్లడం లేదు..

పాక్‎కు ప్రధాని మోడీ మాస్ వార్నింగ్..

More Latest News: External Sources

జైషే కీలక ఉగ్రవాది అనుమానాస్పద మృతి.. భారత్‌ని బెదిరించిన కొన్ని రోజులకే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *