కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ స్కీం డబ్బులు త్వరలో రైతుల ఖాతాల్లో పడనున్నాయి. 18వ విడత పీఎం కిసాన్ డబ్బులు అక్టోబర్ 5 నుంచి రైతుల ఖాతాల్లో వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూలై 18, 2024న 17 వ విడత పీఎం కిసాన్ నిధులు 21వేల కోట్లు ప్రధాని మోదీ రైతుల ఖాతాల్లో జమ చేశారు. 9.26 కోట్ల మంది రైతులు లబ్ది పొందారు. 16వ విడత పీఎం కిసాన్ నిధులు 2024 ఫిబ్రవరిలో విడుదల చేశారు.

పీఎం కిసాన్ స్కీం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2వేల చొప్పున మొత్తం మూడు దఫాలుగా ప్రతియేటా 6వేల రూపాయలు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు -నవంబర్, డిసెంబర్ -మార్చి మూడు వాయిదాల్లో డబ్బు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. పీఎం కిసాన్ పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. అప్పటినుంచి క్రమం తప్పుకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ స్కీం ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ పర్ స్కీంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *