కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ఇచ్చే రుణ పరిమితిని రెండు రెట్లు పెంచనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించిన ఈ యోజన, ఇక నుంచి రూ.20 లక్షలకు పెరిగింది అని స్పష్టం చేశారు.
2024 జులై 23 నుండి ఈ మార్పు అమలులోకి రాబోతోంది. ఆర్థిక మద్దతు, కొత్త వ్యాపారాల అభివృద్ధి మరియు విస్తరణకు మద్దతు ఇవ్వడం పీఎంఎంవై యొక్క ప్రధాన లక్ష్యం. 2015లో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ స్కీమ్, సమీప బ్యాంకులు మరియు ఎన్బీఎఫ్సీల ద్వారా ముద్ర లోన్లను అందిస్తుంది అని పేర్కొన్నారు.