హైదరాబాద్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లపై కాంగ్రెస్ దాడిని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్ రావు ఖండించారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ మేయర్ జె వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ నేత ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ మేయర్‌, కార్పొరేటర్‌లను కాంగ్రెస్‌ నాయకులు 20 కార్లతో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వెంబడించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రజాప్రతినిధులపై జరిగిన ఘటనను బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పీర్జాదిగూడ మేయర్‌, కార్పొరేటర్లకు వెంటనే భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీ, రాచకొండ కమిషనర్‌ను హరీశ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలాంటి దాడులు చేయడం సరికాదని, తమ పార్టీ సభ్యులను టార్గెట్‌ చేస్తే బీఆర్‌ఎస్‌ శాంతించదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *