Bhatti Vikramarka Announces Rs 400 Crore

Bhatti Vikramarka Announces Rs 400 Crore: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌గా రూ.400 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన సింగరేణి సంస్థ ప్రస్తుతం రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదగడం గర్వకారణమని అన్నారు. సింగరేణికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా శాస్త్రీయంగా కులగణన నిర్వహించామని, దాని ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. అసెంబ్లీలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదమైనప్పటికీ, కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. బీజేపీ వల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని, అందుకే రాష్ట్రంలోని ఓబీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయని తెలిపారు. ఈ బంద్ బీజేపీకి వ్యతిరేకమని, అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ నిజంగా బిల్లు ఆమోదం కోసం కృషి చేస్తే కాంగ్రెస్ కూడా సహకరిస్తుందని భట్టి స్పష్టం చేశారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారు

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు…

External Links:

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.400 కోట్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *