Bihar Elections

Bihar Elections: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు వివేక్ జోషి, ఎస్‌ఎస్ సంధు రెండు రోజులు పాట్నాలో పర్యటించనున్నారు. వారు ఈరోజు, రేపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈ పర్యటన పూర్తయ్యాక వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ఈరోజు ఉదయం 10 గంటలకు బీహార్‌లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది. ప్రతి పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధులను ఆహ్వానించారు. మరోవైపు సెప్టెంబర్ 30న ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. బీహార్‌లో మొత్తం 7 కోట్ల 42 లక్షల ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ గడువు 2025 నవంబర్ 22తో ముగుస్తుంది. అందువల్ల అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ప్రారంభంలో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఈసారి కూడా గతంలాగే 3 దశల్లో ఎన్నికలు జరపాలని ఈసీ యోచిస్తోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఘనంగా అలయ్ బలయ్ కార్యక్రమం..

బీహార్‌లో చివరి ఓటర్ల జాబితాలో 7.42 కోట్లు ఓటర్లు ఉన్నారు…

External Links:

నేడు రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ.. ఎన్నికల కసరత్తుపై చర్చ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *