టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు భూమన కరుణాకర రెడ్డికి సవాల్ విసిరారు. భూమనను స్వయంగా తన కారులో ఎస్వీ గోశాలకు తీసుకెళ్తానని, భూమన రావడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. తప్పుడు ప్రచారాల నుంచి తప్పించుకునేందుకు తన ఇంటి దగ్గర రోడ్డుపై పడుకున్నానని, హిందువులకు క్షమాపణ చెప్పాలని బొజ్జల డిమాండ్ చేశారు. భూమిపై ఉన్న ఆవుల గురించి అబద్ధాలు చెప్పడం దారుణమని ఆయన అన్నారు.

ఎస్వీ గోశాలకు కూటమి ఎమ్మెల్యేల బృందం ఇప్పటికే చేరుకుంది. పోలీసులు టీడీపీ కేడర్, నేతలకు లోపలికి అనుమతి ఇవ్వలేదు. దాంతో టీడీపీ కేడర్, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. భూమన కరుణాకర రెడ్డి రాక కోసం కూటమి ఎమ్మెల్యేల బృందం ఎస్వీ గోశాల వద్ద ఎదురుచూస్తున్నారు. భూమన వస్తేనే ఎస్వీ గోశాల లోపలికి వెళుతామంటున్నారు. ప్రస్తుతం ఎస్వీ గోశాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *