కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన అంశంపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మరోసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో క్రిశాంక్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమికి సంబంధించిన నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే ఆరోపణలపై గచ్చిబౌలి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇదివరకే పలుమార్లు క్రిశాంక్‌ను ప్రశ్నించారు. ఈ రోజు మరోసారి విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *