ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. పోలవరంపై ఇప్పటికే పలుమార్లు కేంద్రంతో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధాని, ఆర్థిక, జల విద్యుత్ మంత్రులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చింది.
జాతీయ పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన అన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. బకాయిలు, నిధులు అన్నీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.