తెలంగాణ పోరాటానికి, త్యాగానికి ప్రతీకగా మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రవీంద్రభారతిలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న పొన్నం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ త్యాగానికి గుర్తుగా మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టిందన్నారు. అధికారంలో ఉండగా చాకలి ఐలమ్మ త్యాగాన్ని గుర్తించని వారు, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌బీసీలను విస్మరించారు. కుల గణనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చాకలి ఐలమ్మ చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలన్నారు. ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం, తెలంగాణ ఉద్యమం చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సాగింది. గత ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయిందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *