అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయడు ఢిల్లీకి వెళ్తున్నారు. పదిహేను రోజుల వ్యవధిలో మరోసారి ఆయన ఢిల్లీకి వెళుతుండటం గమనార్హం. తన ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఇతర నేతలను కలిసే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి దేశ రాజధానిలోనే బస చేయనున్నారు. అమిత్ షాతో భేటీ సందర్భంగా విభజన సమస్యలు పరిష్కరించాలని ఏపీ సీఎం కోరే అవకాశముంది. ఇతర రాజకీయ అంశాల పైనా చర్చించనున్నారని తెలుస్తోంది.