chandra babu

Chandrababu UAE Tour: సీఎం చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు. ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్‌ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి 10 గంటలకు యూఏఈకి బయలుదేరారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. అలాగే ఓ సైట్ విజిట్‌లో దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. ఈరోజు ఐదు సంస్థల ప్రతినిధులతో సమావేశం, రాత్రి సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొనడం కూడా జరుగుతుంది. వచ్చే నెల 14, 15 తేదీల్లో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

పర్యటన చివరి రోజున దుబాయ్‌లో ఏపీ ఎన్ఆర్‌టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ముఖాముఖి భేటీ కానున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో

External Links:

యూఏఈ పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *