CM Revanth Reddy Meets Rajnath Singh: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బుధవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అవసరమైన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి రక్షణ శాఖ ఆధీనంలోని భూములను రాష్ట్రానికి ఇవ్వాలని సీఎం కోరారు. స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ఈ భూములు అవసరమని వివరించారు. ముఖ్యంగా మెహదీపట్నం రైతుబజార్ వద్ద స్కైవాక్ నిర్మాణానికి భూమి ఇస్తే ప్రజలకు మంచి సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు.
ఇక మరో అంశంగా రాజీవ్ రహదారి విస్తరణను ప్రస్తావించారు. హైదరాబాద్, కరీంనగర్, రామగుండం రహదారిలో ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ భూమి అవసరమని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని వివరించారు. అదేవిధంగా తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు గురించి కూడా చర్చించారు. ఈ సమావేశంలో పలువురు తెలంగాణ ఎంపీలు సీఎం వెంట ఉన్నారు. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
Internal Links:
నేడు గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2&3 కి శంకుస్థాపన…
కవిత వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన హరీష్ రావు…
External Links:
రాజ్నాథ్తో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణకు రక్షణ శాఖ భూములు.!