తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పరామర్శించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు ఉన్నారు. కాగా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సీఎం రేవంత్‌ను కలిశారు. తాజాగా తాను మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరతానని బండ్ల వ్యాఖ్యానించారు. రంగంలోకి దిగిన మంత్రి జూపల్లి బండ్ల కృష్ణమోహన్ తో చర్చలు జరిపారు. దీంతో ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు సమాచారం.

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్న చెప్పిన సంగతి తెలిసిందే. నియోజకవర్గ అభివృద్ధి నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. గద్వాల రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్యే అనుచరులపై కేసులు, తప్పుడు సమాచారం వల్ల పొరపాట్లు జరిగితే సరిదిద్దుతామన్నారు. బీఆర్ఎస్ నేతలతో అనుబంధం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ లేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిశానని కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. గద్వాల ఎమ్మెల్యే జూపల్లితో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. కాగా, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జూలై 6న కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *