Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan: ప్రపంచ కప్ గెలిచి దేశానికి గౌరవం తీసుకొచ్చిన మహిళా అంధుల క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలో సన్మానించారు. క్రికెటర్లు, కోచ్‌లు, సిబ్బందిని కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షలు, కోచ్‌లకు రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ప్రతి క్రికెటర్‌కు పట్టు చీర, శాలువా, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ వంటి బహుమతులు అందించి ఘనంగా సత్కరించారు.

ఈ విజయం దేశ గర్వంగా నిలిచిందని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అంధ మహిళా క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరతానని తెలిపారు. జట్టు సమస్యలను సీఎం చంద్రబాబుకు చేరుస్తానని హామీ ఇచ్చారు. జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రికెటర్లు దీపిక, కరుణా కుమారి ఉన్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కెప్టెన్ దీపిక గ్రామంలో రహదారి సమస్యను వివరించగా, వెంటనే చర్యలు తీసుకోవాలని పవన్ అధికారులకు ఆదేశించారు. కరుణా కుమారి తెలిపిన సమస్యలపై కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో

External Links:

ప్రపంచకప్‌ విజేతలు.. మహిళా అంధుల క్రికెట్ జట్టుకు పవన్‌ కల్యాణ్ సన్మానం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *