Gujarat Cabinet: దీపావళి పండుగకెక్కే సమయంలో గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగాయి. శుక్రవారం 26 మందితో కేబినెట్ విస్తరణ జరిగింది. ఇందులో హర్ష్ సంఘవి కొత్త డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, అలాగే రివాబా జడేజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. గురువారం అనూహ్యంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా 16 మంది మంత్రులు రాజీనామా చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే కొత్త 26 మంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటు పూర్తయింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం గుజరాత్లోని గాంధీ నగర్ రాజ్భవన్లో జరిగింది.
గుజరాత్ అసెంబ్లీలో 182 మంది సభ్యులు ఉన్నందున గరిష్టంగా 27 మంది మంత్రులు ఉండవచ్చు. మునుపటి మంత్రివర్గంలో 17 మంది మాత్రమే ఉన్నారు, అందులో ఎనిమిది మంది కేబినెట్ హోదా కలిగినవారిగా, మిగతావారు సహాయ మంత్రులుగా పనిచేశారు. తాజాగా 26 మందితో మంత్రివర్గ విస్తరణ జరగడం ద్వారా గుజరాత్లో పాలనా నిర్మాణాన్ని బలోపేతం చేయడం, పరిపాలనలో కొత్త శక్తిని చేర్చడం లక్ష్యంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు…
External Links:
26 మందితో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం