Harish Rao

Harish Rao: ఒకప్పుడు తెలంగాణలో ఒక ఎకరా భూమిని అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో పదేకరాల భూమి కొనుగోలు చేయవచ్చు అనేదని, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మారిపోయిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇప్పుడు ఏపీలో ఒక ఎకరా భూమిని అమ్మితే, తెలంగాణలో రెండు ఎకరాలు వస్తాయని చెప్పారు. ఆయన పాలనలో రాష్ట్రం దెబ్బతిన్నదని, ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. సిద్దిపేటపై కాంగ్రెస్ పార్టీ కక్షగట్టిందని ఆరోపించారు. ప్రజ్ఞాపూర్‌లో గజ్వేల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధోగతికి నెట్టిందన్నారు.

కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర అనుభవాలను ఎదుర్కొంటున్నారని, రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులను ఆయన కోరారు. సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసగించారని, కొత్తగా పెన్షన్ ఇవ్వకుండా ఇప్పటికే ఉన్న రెండు లక్షల పెన్షన్లను రద్దు చేశారని విమర్శించారు. ఎరువుల కోసం ప్రజలు క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని, కేసీఆర్ హయాంలో రైతులకు అందిన నిధులు ఇప్పుడు ఓట్లకు మాత్రమే వస్తున్నాయని అన్నారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారని, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గజ్వేల్ అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని, నాయకులు గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండాలని, రిజర్వేషన్ల ప్రకారం పోటీదారులను చర్చించి నిర్ణయించుకోవాలని హరీష్ రావు సూచించారు.

Internal Links:

ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు..

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు..

External Links:

ఒకప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు వచ్చేవి.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *