Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయం దగ్గరపడడంతో హైదరాబాద్లో రాజకీయ వేడి పెరిగింది. అక్టోబర్ 21 నామినేషన్లకు చివరి రోజు కాగా, మధ్యాహ్నం మూడు గంటల వరకు దాఖలు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండు సెట్లను, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మూడు సెట్లను దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి విష్ణు రెడ్డి డమ్మీ నామినేషన్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఆయన భార్య నామినేషన్ దాఖలు చేసింది. అక్టోబర్ 21న స్క్రూటినీ జరగగా, అక్టోబర్ 24 వరకు నామినేషన్లు వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.
ఎగ్జిట్ పోల్స్పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. నవంబర్ 6 ఉదయం 7 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6.30 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. పత్రికలు, టీవీలు, రేడియో, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్లకు ఇది వర్తిస్తుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లకు చివరి రోజు… ఇప్పటిదాకా 94 మంది నామినేషన్లు దాఖలు..