కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమైన విషయం అని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 8 మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్రానికి, నిధులు కేటాయించని బీజేపీకి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలంగాణకు నిధులు కేటాయిస్తారని ఆశిస్తే, ఎప్పటిలాగే గుండు సున్నా దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్​కు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని తెలిపారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, మంత్రులు ఢిల్లీ వెళ్లి నిధులు అడిగినా కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. పార్లమెంటులోని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. గులాబీ కండువా వేసుకున్న ఎంపీలు పార్లమెంటులో ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్లని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *