Mynampally Hanumanth Rao: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు “మార్వాడీ హటావో” నినాదాన్ని వ్యతిరేకించారు. మనమంతా భారతీయులమేనని, ఎక్కడైనా జీవించవచ్చని అన్నారు. అందరికీ ఒకే రాజ్యాంగం, ఒకే పాస్పోర్ట్ ఉందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకున్నారని చెప్పారు. ఇటువంటి నినాదాలు పెరిగితే మనకే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. అభివృద్ధి కూడా ఆగిపోతుందని అన్నారు. ఈ వివాదం ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని స్పష్టం చేశారు.
హనుమంత్ రావు సమైక్యత ప్రాముఖ్యతను వివరించారు. విదేశాల్లో ఎన్నో ఉన్నత స్థానాల్లో భారతీయులు ఉన్నారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మినీ ఇండియా అని పేర్కొన్నారు. కులం, మతం పేరుతో విభజన చేస్తే నష్టం మనకే జరుగుతుందని హెచ్చరించారు. “నీవు, నేను కలిస్తేనే మనం. అందరం కలిస్తేనే ప్రజలు” అన్నారు. ఎక్కడో జరిగిన తప్పును ఇక్కడ రుద్దకూడదని అన్నారు. తప్పు చేసిన వారినే శిక్షించాలన్నారు. “మన పిల్లలు విదేశాల్లో ఉన్నారు. వారిని అక్కడి నుండి పంపిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి అందరం ఐక్యంగా ఉండాలి” అని వ్యాఖ్యానించారు.
Internal Links:
75వ బర్త్డే చేసుకుంటున్న ప్రధాని మోడీ
ఎర్రమట్టి దిబ్బలు కోసం పవన్ కళ్యాణ్ పోరాటం ఫలించింది.
External Links:
మనమే నష్షపోతాం.. మార్వాడీ హటావో నినాదానికి నేను వ్యతిరేకం!