PM Narendra Modi To Visit AP

PM Narendra Modi To Visit AP: రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకొని, అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నీ పెంటకు వెళ్లనున్నారు. రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుని, ఉదయం 11.15కి శ్రీశైలం ఆలయంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్నారు. తరువాత, మధ్యాహ్నం 12.10కి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు.

సున్నీ పెంట నుంచి హెలికాప్టర్‌లో నేరుగా నన్నూరు రాగ మయూరి గ్రీన్ హిల్స్ ఎలిప్యాడ్స్‌కు చేరతారు. మధ్యాహ్నం 2.30కి సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొని, 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 4.50కి కార్యక్రమం ముగించుకొని, కర్నూలు ఎయిర్‌పోర్టుకు వెళ్లి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి బయలుదేరతారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

గోవా మంత్రి, మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ కన్నుమూత

విశాఖలో గూగుల్ డేటా సెంటర్..

External Links:

రేపు ఏపీకి ప్రధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *