పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపి) రాహుల్ గాంధీ కులాన్ని స్పష్టంగా ప్రస్తావిస్తూ లోక్‌సభ ఎంపి అనురాగ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహారాష్ట్రలోని కాంగ్రెస్ గురువారం బిజెపికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టింది. గాంధీపై ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), ఓబీసీ వర్గాలను అవమానించడమేనని ప్రతిపక్ష పార్టీ పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే కోరారు.

నిరసన సందర్భంగా ముంబైలో పటోలే విలేకరులతో మాట్లాడుతూ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెనుకబడిన వర్గాల హక్కుల కోసం తన గొంతుకను పెంచుతున్నారని, కుల ప్రతిపాదికన జనాభా గణనను డిమాండ్ చేస్తున్నారన్నారు. దీనికి ప్రతీకారంగా, ఓ బీజేపీ ఎంపీ రాహుల్ గాంధీని లోక్‌సభలో ఆయన కులం గురించి అడిగారు. ‘‘బీజేపీ రాహుల్ గాంధీని అవమానించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, సంచార జాతులు, ఓబీసీ వర్గాలను అగౌరవపరిచింది’’ అని కాంగ్రెస్ నేత వాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *