తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత రుణమాఫీకి సిద్ధమైంది. రెండో విడత రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. లక్షన్నర లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో రేపు నిధులు జమ కానున్నాయి. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ చెక్కులను సీఎం రేవంత్‌ ఆవిష్కరించనున్నారు. రెండో విడతలో భాగంగా రూ.లక్షన్నరలోపు రుణాలు ఉన్న వారికి ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.6,098.93 కోట్లను అప్పులపాలైన రైతుల ఖాతాల్లో జమ చేసింది. మొదటి విడతలో భాగంగా రుణం పొందిన రైతుల ఖాతాలో రూ. లక్ష తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.6,098.93 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది.

రైతు రుణమాఫీ ప్రక్రియ మొత్తం పూర్తయితే ఏకకాలంలో రూ.31 వేల కోట్లను మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనుంది. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయలేదు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా, తెలంగాణలో ఇవాళ ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం జరిగింది. వివిధ శాఖల మంజూరుపై చర్చ జరగనుంది. శాసనసభలో 19 అంశాలపై చర్చ జరగనుంది. ఆర్థిక నిర్వహణ, ప్రణాళిక, విద్యుత్ డిమాండ్‌పై చర్చించనున్నారు. 9 అంశాలపై చర్చించిన అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *