తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ నిన్న (శుక్రవారం) రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. వెంకటేష్‌గౌడ్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. కాగా, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బేగంపేటలోని బ్రాహ్మణవాడి నివాసం సమీపంలో ఉంచారు. కూన వెంకటేష్ గౌడ్ అంత్యక్రియలను ఈరోజు (శనివారం) ఆయన స్వగ్రామం గాజులరామారంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *