కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో ధర్నాకు దిగారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ లోక్ సభ ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే అమలు చేసేందుకు బడ్జెట్ లో హామీలు, కేటాయింపులు ఉన్నాయి. తెలంగాణలోని పాత జిల్లాల్లో 9 వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు బడ్జెట్‌లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు రాశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులకు మేము వ్యతిరేకించడం లేదని, తెలంగాణకు కేటాయింపులు కావాలని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో బీఆర్‌ఎస్‌ రాజీపడింది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లేవనెత్తుతామని, తెలంగాణకు న్యాయం జరిగే వరకు పార్లమెంట్‌లో పోరాడతామన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు నమ్మక ద్రోహం చేశారని భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా న్యాయం జరగలేదన్నారు. విభజన చట్టం 2014లో ఉంటే అప్పటి నుంచి లేని కేటాయింపులు ఈసారి బడ్జెట్‌ లోనే ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రధాని కుర్చీని కాపాడుకునేందుకే బడ్జెట్ లో నితీశ్, చంద్రబాబు రాష్ట్రాలకు న్యాయం చేశారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాడాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *