Revanth

Warangal Floods Aerial Survey: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు వరంగల్, హుస్నాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలని నిర్ణయించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. అయితే గురువారం వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ప్రయాణం సాధ్యంకాలేదు. దీంతో అధికారుల సూచనల మేరకు ఏరియల్ సర్వే రద్దయింది. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ, “ఈరోజు వాతావరణం సహకరించకపోవడంతో రాలేకపోయాను. శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తాను” అని తెలిపారు.

ఇక మొంథా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లా తీవ్ర వర్షాలకు గురైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురై ఇళ్లల్లోకి నీరు చేరింది. శాఖ రాసి కుంట, శివనగర్, బీఆర్ నగర్, ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్, కిల్లా వరంగల్ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు విరగడం, వైర్లు తెగిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి నష్టం చోటు చేసుకుంది. రోడ్లు, నాలాలు నీటితో నిండిపోవడంతో అధికారులు ముమ్మరంగా నీటిని మళ్లించే పనులు చేస్తున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో

External Links:

నేడు ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ పర్యటన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *