Bangladesh women vs india women

Bangladesh women vs india women: ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, వర్షం కారణంగా ఆటను 27 ఓవర్లకు కుదించారు. బంగ్లాదేశ్ 27 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. షర్మిన్ అక్తర్ (37), శోభన మోస్తరీ (26) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో రాధా యాదవ్ మూడు వికెట్లు తీయగా, శ్రీచరణి, రేణుకా సింగ్, దీప్తి శర్మ, అమన్ జోత్ కౌర్ ఒక్కొక్క వికెట్ తీసారు.

డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్‌కు 126 పరుగుల లక్ష్యం నిర్ధారించగా, స్మృతి మందాన (34) మరియు అమన్ జోత్ కౌర్ (15) ఇన్నింగ్స్ ప్రారంభించారు. భారత్ 8.4 ఓవర్లలో 57 పరుగులు చేసిన సమయంలో మళ్లీ వర్షం ప్రారంభమైంది. వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఫలితం తేలకుండానే భారత్, బంగ్లాదేశ్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ ముగిసింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

దక్షిణాఫ్రికా vs శ్రీలంక హైలైట్స్, మహిళల ప్రపంచ కప్ 2025

పది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చిత్తు..

External Links:

భారత్, బంగ్లా మ్యాచ్ రద్దు.. చివర్లో టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *