Ind Vs Eng Semi Final 2: టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్-2గా భారత్–ఇంగ్లాండ్ మధ్య కీలక పోరు నేడు ముంబై వానఖేడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్లో న్యూజిలాండ్తో టైటిల్ కోసం తలపడుతుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్, హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఇంగ్లాండ్ బరిలోకి దిగుతున్నాయి. వరుసగా మూడోసారి ఈ రెండు జట్లు టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో తలపడటం ప్రత్యేకం. 2022లో ఇంగ్లాండ్ భారత్ను ఓడించి ఫైనల్ చేరగా, 2024లో భారత్ ప్రతీకారం తీర్చుకుని కప్ గెలుచుకుంది.
వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలిగితే రిజర్వ్ డే ఏర్పాటు చేశారు. అదనంగా 90 నిమిషాలు, మరో రోజు 120 నిమిషాల సమయం ఉంది. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ జరిపేందుకు ప్రయత్నిస్తారు. పూర్తిగా మ్యాచ్ రద్దయితే సూపర్-8 పాయింట్ల పట్టిక ఆధారంగా ఫలితం నిర్ణయిస్తారు. అప్పుడు గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఫైనల్కు చేరుతుంది. అయితే నేడు వర్షం వచ్చే అవకాశం లేదు కాబట్టి పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో మరో హైస్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చని అభిమానులు భావిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
నేడే సెమీఫైనల్-2.. ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడేది ఎవరో.!