Ind Vs Sa 3rd Odi In Visakhapatnam: ప్రస్తుతం భారత్–దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ 1-1తో సమంగా కొనసాగుతోంది. రాంచీలో తొలి వన్డేలో ఓడిన దక్షిణాఫ్రికా, రాయ్పుర్లో జరిగిన రెండో మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను సమం చేసింది. ఇప్పుడు డిసెంబర్ 6న వైజాగ్లో జరిగే మూడో వన్డే సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది. మ్యాచ్ కారణంగా విశాఖలో క్రికెట్ ఊపందుకుంది.
వైజాగ్లోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్కు టికెట్ బుకింగ్స్ ఇప్పటికే పూర్తిగా అమ్ముడుపోయాయి. సిరీస్ డిసైడర్ కావడంతో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఐపీఎల్ 2025 తర్వాత విశాఖలో మ్యాచ్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు సాయంత్రం రెండు జట్లు రాయ్పూర్ నుంచి విశాఖకు చేరుకోనున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రెండో టెస్టు తొలి రోజు సెన్సేషన్- కుల్దీప్ యాదవ్ త్రివికెట్లతో సఫారీలను నిలువరించాడు!
External Links:
విశాఖ నగరంలో క్రికెట్ సందడి.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు!