Messi Fans Protest: కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ అభిమానులను ఉత్సాహపరిచారు. డిసెంబర్ 13న లేక్టౌన్లోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్లో మెస్సీ పేరుతో ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్తో పాటు పశ్చిమ బెంగాల్ మంత్రి పాల్గొన్నారు. మెస్సీని చూడటానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియంలో తిరుగుతూ మెస్సీ అభిమానులకు అభివాదం చేయడంతో, మొత్తం స్టేడియం మెస్సీ నినాదాలతో మారుమోగింది.
కోల్కతా పర్యటన ముగిసిన తర్వాత లియోనెల్ మెస్సీ హైదరాబాద్కు బయలుదేరారు. అయితే సాల్ట్లేక్ స్టేడియంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మెస్సీ కొద్దిసేపే ఉండి వెళ్లిపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది ఫ్యాన్స్ సీట్లు ధ్వంసం చేసి, గ్రౌండ్లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. బారికేడ్లు దాటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో గందరగోళం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా, మెస్సీ టీమ్ను సొరంగం ద్వారా బయటకు తీసుకెళ్లారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రెండో టెస్టు తొలి రోజు సెన్సేషన్- కుల్దీప్ యాదవ్ త్రివికెట్లతో సఫారీలను నిలువరించాడు!
External Links:
కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం.. మెస్సీ త్వరగా వెళ్లిపోయారని ఆవేదన..