పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం లభించింది. 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్లో కాంస్యం సాధించాడు. భారత్కు ఇది ఆరో పతకం. నిన్న జరిగిన 57 కేజీల విభాగంలో 13-5తో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్ టోయ్ను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన ఏకైక పురుష రెజ్లర్ అమన్. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో జపాన్ టాప్ సీడ్ రీ హిగుచి చేతిలో 0-10 తేడాతో చిత్తుగా ఓడిన అమన్. ఈ మ్యాచ్ లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా ప్రత్యర్థిని ఆకట్టుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించి దరియన్ను ఓడించి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ పతకాన్ని తన దివంగత తల్లిదండ్రులకు, దేశ ప్రజలకు అంకితమిచ్చాడు.
ఒలింపిక్స్లో పతకం సాధించిన ఏడో భారతీయ రెజ్లర్గా అమన్ నిలిచాడు. 1952 హెల్సింకిలో జరిగిన ఒలింపిక్స్లో కేడీ జాదవ్ కాంస్యం సాధించాడు. స్వతంత్ర భారతదేశంలో తొలి పతకం సాధించిన రెజ్లర్గా జాదవ్ పేరు రికార్డుల్లో నిలిచిపోయింది. అలాగే పతకం సాధించిన అమన్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఒలింపిక్స్లో వ్యక్తిగత పతకాన్ని సాధించిన అతి పిన్న వయస్కుడిగా (21 సంవత్సరాల 24 రోజులు) కూడా అమన్ రికార్డు సృష్టించాడు.