భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో హుండీ ని సోమవారం లెక్కించారు. జూన్ 12 నుంచి జులై 22 వరకు ఆలయ హుండీ ఆదాయం రూ. 1,21,44,579 గా లెక్కించారు. దీనితో పాటు 104 గ్రాముల బంగారం, 805 గ్రాముల వెండి లెక్కించారు. అలాగే 1000 మయన్మార్ క్యాట్లు , 183 అమెరికా డాలర్లు, 50 కెనడా డాలర్లు, 10 నేపాల్ రూపీస్ మరియు 2 ఖతార్ రియాల్స్ విదేశీ ధనం రూపంలో వచ్చినట్లు ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమం సీసీ కెమెరాల ఆధ్వర్యంలో హుండీలను తెరిచి లెక్కించారు. కాగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

By Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *