Silver Price Jumps 11000: ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఎప్పుడూ లేని రీతిలో రికార్డు స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాల కారణంగా ఇన్వెస్టర్లు భద్రమైన పెట్టుబడులైన బంగారం, వెండివైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం ఈ ఏడాది దాదాపు 63 శాతం వరకు లాభపడగా, 2025లో వెండి ధరలు సుమారు 118 శాతం వరకు పెరిగాయి. కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువలో మార్పులు ఈ లోహాలపై డిమాండ్ను మరింత పెంచాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే రాబోయే రోజుల్లో కూడా బంగారం, వెండి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఈరోజు (డిసెంబర్ 17) బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.1,34,510కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.600 పెరిగి రూ.1,23,300 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఈరోజు ఒక్కరోజే రూ.11,000 వరకు పెరగడంతో కిలో వెండి ధర రూ.2,22,000 స్థాయికి చేరుకుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
External Links:
చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు.. ఇవాళ ఒక్కరోజే రూ.11 వేలు పెరిగిన సిల్వర్