సంగారెడ్డి: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ నగర్‌లో సోమవారం రాత్రి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరి వేసుకుని మృతి చెందాడు. సంగారెడ్డి పట్టణానికి చెందిన విద్యుత్‌నగర్‌లో నివాసముంటున్న కిరణ్‌(25) మంగళవారం ఉదయం నుంచి తన స్నేహితులు, బంధువులు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో అతని స్నేహితులు ఇంటికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. కిరణ్ కొంతకాలంగా విప్రోలో పనిచేస్తున్నారు. తాను డిప్రెషన్‌లో ఉన్నానని, కుటుంబ సమస్యల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టానని సూసైడ్ నోట్‌ను వదిలిపెట్టాడు. కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

By Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *