News5am,Breaking Telugu New (14-05-2025): ప్రపంచ క్యాథలిక్ క్రైస్తవ మతానికి ప్రధాన గురువిగా అమెరికాకు చెందిన కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ ఎన్నికయ్యారు. ఆయన “లియో-14” అనే పేరుతో పోప్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సిస్టీన్ చాపెల్ పై తెల్ల పొగ పొంగడం ద్వారా రెండవ రోజే కాన్‌క్లేవ్ ఓటింగ్ ముగిసిందని సంకేతాలు వచ్చాయి. 69 ఏళ్ల ప్రీవోస్ట్, పోప్ పదవికి ఎన్నికైన తొలి అమెరికన్ కావడం విశేషం. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగోకు చెందిన ప్రీవోస్ట్, అంతర్జాతీయ స్థాయిలో అనుభవమున్న మత నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన తన జీవితంలో ఎక్కువ భాగాన్ని దక్షిణ అమెరికాలో మిషనరీగా గడిపారు. పెరూలో బిషప్‌గా సేవలందించిన ఆయన, ఇటీవల వరకు వాటికన్‌లో బిషప్‌ల నియామకాలకు సంబంధించి ఉన్న ముఖ్యమైన కార్యాలయానికి నేతృత్వం వహించారు. ఇకపై ప్రపంచంలోని 140 కోట్ల మంది క్యాథలిక్‌లకు ఆయన ఆధ్యాత్మిక నేతగా మారనున్నారు. పోప్ ఫ్రాన్సిస్ చేపట్టిన మార్పులను లియో-14 కొనసాగించనున్నారని విశ్వాసం.

ప్రీవోస్ట్, దాదాపు పదేళ్లపాటు పెరూలోని ట్రుజిల్లోలో మిషనరీగా సేవలందించారు. అనంతరం 2014 నుండి 2023 వరకు చక్లాయో అనే నగరంలో బిషప్‌గా పని చేశారు. 2015లో ఆయన పెరూ పౌరసత్వాన్ని పొందారు. “నేను ఇప్పటికీ మిషనరీనేనని భావిస్తాను. ప్రతీ క్రైస్తవుడిలాగే, ఎక్కడ ఉన్నా సువార్తను పంచుకోవడమే నా ధర్మం,” అని ఆయన వాటికన్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పోప్ లియో-14గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెయింట్ పీటర్స్ బేసిలికాలోని బాల్కనీపై నుంచి తొలిసారి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. “మీ అందరికీ శాంతి కలుగుగాక” అని ఆయన ప్రారంభించారు. ఇది పునరుత్థానమైన యేసుక్రీస్తు పలికిన మొదటి మాటలని, ఈ శాంతి మన హృదయాల్లోకి, మన ఇంటికీ రావాలని ఆయన ఆకాంక్షించారు.

More Breaking Telugu News

ఎన్టీఆర్ – నీల్ ఫస్ట్ షెడ్యూల్ ముగించారు..

నూతన పోప్‌గా కార్డినల్ రాబర్ట్ ప్రివోస్ట్…

More Breaking Telugu New: External Sources

నూతన పోస్ట్.. రాబర్ట్ ప్రీ పోస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *