హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారిని ఆదుకునేందుకు, పోలీసులకు ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించేందుకు కరీంనగర్‌, రామగుండం కమిషనరేట్‌ ఆవరణలో మంగళవారం ప్రత్యేక సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లను ప్రారంభించారు. కరీంనగర్‌ స్టేషన్‌ను కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అభిషేక్‌ మొహంతి ప్రారంభించగా, రామగుండంలో స్టేషన్‌ను రామగుండం సీపీ ఎం. శ్రీనివాసులు ప్రారంభించారు.
స్టేషన్లకు ఏసీపీ ర్యాంక్ అధికారి నేతృత్వం వహిస్తారు. ఇక నుంచి రూ.లక్షకు పైగా నష్టపోయిన వ్యక్తులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చు. స్టేషన్‌ను ప్రారంభించిన కరీంనగర్ సీపీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ ఫోన్‌లలో వచ్చే స్పామ్ లింక్‌లను తెరవవద్దని ప్రజలకు సూచించిన ఆయన వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ క్రైమ్‌లపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1930ని సంప్రదించాలని, సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయినట్లయితే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లను ఆశ్రయించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *