హైదరాబాద్: ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మే 26న ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పట్టణ వ్యవసాయ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రెడ్ హిల్స్ హైదరాబాద్లోని తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ‘మన ఇల్లు మన కురగాయలు’ కార్యక్రమం కింద, వర్షపు నీటి నిల్వతో పాటు నాణ్యమైన పురుగుమందుల అవశేషాలు లేని కూరగాయలను టెర్రస్పై పండించడంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100.