తెలంగాణలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ అంగీకరించింది. ఈ మేరకు అమెజాన్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్తో సమావేశమయ్యారు.
తెలంగాణలో భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది. వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ సంగ్రాజ్ను కలిశారు. పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ అంగీకరించింది. రూ.750 కోట్లతో తొలి దశ విస్తరణ చేపట్టనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. దీంతో కొత్తగా 17 వేల ఉద్యోగాలు వస్తాయని అధికారులు తెలిపారు.