Breaking Latest News

News5am, Breaking Latest News (09-06-2025): మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒక దురదృష్టకర ఘటన జరిగింది. ముంబ్రా – దివా స్టేషన్ల మధ్య లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికులు రైలులో నుంచి జారి పడడంతో ఐదుగురు మృతి చెందారు. ఇంకా కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ లోకల్ ట్రైన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వైపు వెళ్తుండగా, పుష్పక్ ఎక్స్‌ప్రెస్ మరియు కసారా లోకల్ ట్రైన్లు ఒకదానికొకటి దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రైన్లలో ఎక్కువ రద్దీ ఉండటం వల్ల ప్రయాణికులు డోర్ల దగ్గర వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో దాదాపు 10 నుంచి 12 మంది ప్రయాణికులు ట్రైన్ నుంచి జారి పట్టాలపై పడిపోయారు. అందులో ఐదుగురు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక, ముంబైలో విప‌రీత‌మైన ర‌ద్దీతో లోక‌ల్ ట్రైన్లో ప్రయాణికులు ఫుట్ బోర్డింగ్‌లో ప్రయాణించడం అక్కడ సర్వసాధారణం.

More Breaking Latest News:

Latest News:

65 వేల కొత్త ఆటో రిక్షాలకు అనుమతి..

తొక్కిసలాట కలకలం: ఆర్‌సిబి ఉద్యోగిని అరెస్టు చేసిన పోలీసులు

More Breaking Latest News: External Sources

రైల్లో నుంచి జారిపడి ఐదుగురు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *