News5am, Breaking Telugu Latest News (20-05-2025): హైదరాబాద్ వాసులకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు నగరంలో ఆకాశం మేఘావృతంగా ఉండి ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మే 23 వరకు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, వాతావరణ ఔత్సాహికుడు టి. బాలాజీ కూడా విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం (మే 20) నుంచి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు.
ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ముందస్తుగా సమాచారం అందించగా, వరద నీరు నిలిచే ప్రదేశాలను గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 100 మి.మీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొనబడింది.
More News:
Breaking Telugu Latest News:
కారు డోర్లు లాక్ అయి నలుగురు చిన్నారులు మృతి..
More Breaking News: External Sources
హైదరాబాద్ వాసులకు IMD బిగ్ అలర్ట్..