Bus Accident in Kurnool: కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతై పూర్తిగా బూడిదైంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా సజీవ దహనమైనట్లు సమాచారం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరి ట్రావెల్స్ వోల్వో బస్సు కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద స్కూటర్ను ఢీకొట్టడంతో బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. 41 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సులో చాలామంది నిద్రలో ఉండటంతో వారు తప్పించుకోలేకపోయారు.
క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి బయటపడ్డారు. మొత్తం 12 మంది ప్రాణాలతో బయటపడగా, వారికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు పూర్తిగా కాలిపోవడంతో రక్షణ చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎక్కువ మంది ప్రయాణికులు హైదరాబాద్కు చెందినవారని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
కర్నూలు జిల్లాలో పెను విషాదం.. ప్రైవేట్ బస్సు దగ్ధం.. 20 మందికి పైగా మృతి!