Cyclone Ditwah: దిత్వా తుఫాన్ తమిళనాడులో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, తుఫాన్ ఆదివారం తెల్లవారుజామున ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయంగా 300 కి.మీ, చెన్నైకి దక్షిణంగా 400 కి.మీ దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. తీరం వెంట గాలుల వేగం గంటకు 50–70 కి.మీ. వరకు పెరిగే అవకాశం ఉండడంతో చెన్నై విమానాశ్రయం 54 విమానాలను రద్దు చేసింది. అలాగే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసివేసి హెచ్చరికలు జారీచేశారు.
శ్రీలంకలో కూడ దిత్వా భారీ నష్టం కలిగించింది. వరదలు మరియు కొండచరియలు కారణంగా 123 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 34 మంది గల్లంతయ్యారు. ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు భారత ప్రభుత్వం మానవతా సహాయం పంపించింది. ప్రత్యేక కార్గో విమానాల ద్వారా అవసరమైన సహాయ సామగ్రిని రవాణా చేసి సహాయక చర్యలు చేపట్టింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మళ్లీ పెరిగిన బంగారం–వెండి ధరలు: హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇదే!
భారీ లేఆఫ్స్ ప్రభావం – సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే పెద్ద దెబ్బ.. 40% టెకీ పోస్టులు ఖాళీ!
External Links:
తమిళనాడులో దిత్వా తుఫాను బీభత్సం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత