Cyclone Montha in kakinada

Cyclone Montha in kakinada: కోస్తా జిల్లాల వైపు ‘మొంథా’ తుపాను వేగంగా దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం తీవ్ర వాయుగుండం కొనసాగుతుండగా, ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారి, రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా. తుఫాను ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఇప్పటికే కాకినాడలో తుఫాన్ ప్రభావం ప్రారంభమై, సముద్రతీర ప్రాంతాల్లో గాలులు బలంగా వీస్తున్నాయి. అధికారులు హై అలెర్ట్ ప్రకటించి, 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండగా, షిప్లను సముద్రంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీచ్‌లు, పర్యాటక ప్రాంతాలు మూసివేయబడగా, విద్యా సంస్థలకు ఐదు రోజుల సెలవు ప్రకటించారు. సహాయక చర్యల కోసం ఈతగాళ్లు, బోట్లు సిద్ధంగా ఉంచారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.

ఆర్థిక వృద్ధికి కొత్త దారులు చూపించారు… అర్థశాస్త్ర నోబెల్ బహుమతి విజేతల ప్రకటనా

External Links:

కాకినాడలో మొదలైన మొంథా తుపాన్ ప్రభావం.. ఒక్కసారిగా మారిన వాతావరణం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *